పేదల సంక్షేమమే ధ్యేయం.. ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
నూజివీడు నియోజకవర్గంలో పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
బుధవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావుతో పాటు 3వ బూత్ కన్వీనర్ పరసా శ్రీను పాల్గొని సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్ముతో పేద కుటుంబాలు ఆర్థికంగా భరోసా పొందుతూ ధీమాగా జీవిస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఆర్వో శోభన్బాబు, పరసా శ్రీను, బన్నే వెంకటేశ్వరరావు, బన్నే గోపాలకృష్ణ, కడగంచు మహేష్ తదితరులు పాల్గొన్నారు.