పది ఫలితాల్లో గ్రీన్ గ్రోవ్ ప్రభంజనం
పది ఫలితాల్లో గ్రీన్ గ్రోవ్ ప్రభంజనం NTODAY NEWS చిట్యాల
చిట్యాల మండల టాపర్లుగా అక్షర్ సహస్ర
పదో తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని తమ పాఠశాల కీర్తిని పతాక స్థాయికి చేర్చారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలకు చెందిన బాలగోని అక్షర్ 585 అత్యుత్తమ మార్కులతో మండలంలోనే మొదటి స్థానంలో నిలవగా.. పందిరి సహస్ర 581 మార్కులతో తాన్ ప్రతిభను చూపించి మండలంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఘన విజయంపై పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్ మరియు585 ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల సరైన దిశానిర్దేశం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపి విద్యార్థులను ఘనంగా సన్మానించారు..