BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 11:57 AM
30 వీక్షణలు

పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు 101వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు మండలం మర్రిపాడులో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యంలో ఖండకావ్యాలు, కథలు, నాటికలు, కవితలు, గేయాలు, సినీగీతాలు, అనువాదాలు వంటి అనేక ప్రక్రియల్లో విశిష్ట సేవలందించారని కొనియాడారు.

కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం నింపిన మహాకవి దాశరథి అని పేర్కొన్నారు. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవిగా సేవలందించారని గుర్తు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, కళా ప్రపూర్ణ, కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారధి వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, బిరుదులు ఆయనకు లభించాయని వివరించారు.

కార్యక్రమంలో నామా రవి, ఆళ్ళ మురళి, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని దాశరథికి ఘనంగా నివాళులర్పించారు.