www.ntodaynews.com
పెనుగొలనులో భాషావేత్త తిరుమల రామచంద్ర జయంతి వేడుకలు ఘనంగా
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భాషావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు తిరుమల రామచంద్ర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరుమల రామచంద్ర మన లిపి–పుట్టు పూర్వోత్తరాలు, హంపి నుండి హరప్పా దాకా, సాహితీ సుగతి వంటి అమూల్యమైన రచనలు చేసిన గొప్ప భాషావేత్త అని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ సహా అనేక పురస్కారాలు లభించాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, నామా రవి తదితరులు పాల్గొన్నారు.