BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 May, 2026 - 12:49 PM
268 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన నిర్వహించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, యుద్ధ నివారణ చర్యలపై దృష్టి పెట్టకుండా ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజల నడ్డి విరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు భీమ్‌సేన్, కార్యదర్శి సతీష్, నాయకులు భిక్షపతి, అశోక్, రాజేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు