www.ntodaynews.com
పిడుగు పడి వరిగడ్డి వాము దగ్ధం…
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
పిడుగు పడి వరిగడ్డి వాము దగ్ధం… ఇబ్రహీంపట్నంలో కలకలం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం జయప్రద నగర్ వద్ద సాంబశివ అపార్ట్మెంట్ పక్కన ఉన్న వరిగడ్డి వాము పై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనతో వాము వెంటనే మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.
స్థానికులు గమనించి వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం ఉపశమనకరం. అయితే వరిగడ్డి వాము పూర్తిగా కాలిపోవడంతో యజమానికి ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.