BREAKING
​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం ​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం
www.ntodaynews.com

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 May, 2026 - 02:22 PM
10 వీక్షణలు

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో సెంటర్‌లో శనివారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ప్రతి ఇంటింటికీ తిరుగుతూ, బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అలాగే పౌష్టికాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని వివరించారు. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, డి. జ్యోతి, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, మమత, అలాగే తల్లిదండ్రుల తరపున కిషోర్ మరియు స్థానిక బాలురు, బాలికలు, మహిళలు పాల్గొన్నారు.