BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 02:22 PM
176 వీక్షణలు

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో సెంటర్‌లో శనివారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ప్రతి ఇంటింటికీ తిరుగుతూ, బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అలాగే పౌష్టికాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని వివరించారు. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, డి. జ్యోతి, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, మమత, అలాగే తల్లిదండ్రుల తరపున కిషోర్ మరియు స్థానిక బాలురు, బాలికలు, మహిళలు పాల్గొన్నారు.