BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 May, 2026 - 02:22 PM
103 వీక్షణలు

పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో సెంటర్‌లో శనివారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ప్రతి ఇంటింటికీ తిరుగుతూ, బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, అలాగే పౌష్టికాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని వివరించారు. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి అడుగు అని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, డి. జ్యోతి, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, మమత, అలాగే తల్లిదండ్రుల తరపున కిషోర్ మరియు స్థానిక బాలురు, బాలికలు, మహిళలు పాల్గొన్నారు.