పల్లెవాడలో ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేత సండ్ర వెంకట వీరయ్య
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం పల్లెవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం, అలాగే ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాలువాతో ఘన సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీరప్పనేని బాబీ, వల్లభనేని పవన్, గొర్ల సత్యనారాయణ రెడ్డి, యలమంచిలి వెంకటేశ్వరరావు, రావూరి నాయుడు, గ్రామ ఉపసర్పంచ్ కుటుంబరావు, బొంతు రామారావు, వేణు బాబు, నల్లబోయిన చిన్నకృష్ణ, గాయం రాంబాబు, చెరుకు ప్రతాపరెడ్డి, నరసింహారావు, బొజ్జ మల్లేశ్వరరావు తదితర గ్రామ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.