BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 31 August 2026, 08:12 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

విద్యార్థులకు వేద గణితంపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్ జాతీయం
31 Aug, 2026 - 08:12 PM
12 వీక్షణలు

పల్నాడు జిల్లా, నరసరావుపేట: నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వేద గణితంపై ఒకరోజు అవగాహన సదస్సును నిర్వహించారు.

గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, సులభమైన పద్ధతుల్లో గణిత సమస్యలను పరిష్కరించే విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన గణిత అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ సదస్సుకు ప్రముఖ వేద గణిత నిపుణుడు ఆర్. గురు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సాధారణ పద్ధతులతో పోలిస్తే వేద గణితంలోని సులభమైన సూత్రాలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా లెక్కలను వేగంగా, కచ్చితంగా పూర్తి చేయవచ్చని వివరించారు.

పోటీ పరీక్షల్లో సమయపాలన, వేగం, కచ్చితత్వం ఎంతో ముఖ్యమని, వేద గణిత పద్ధతులు విద్యార్థులకు ఈ అంశాల్లో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు గణితాన్ని కష్టమైన సబ్జెక్ట్‌గా భావించకుండా ఆసక్తితో నేర్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పలు గణిత సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించి చూపిస్తూ, వాటిని సులభంగా ఎలా సాధించవచ్చో వివరించారు. విద్యార్థులు సదస్సులో ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.