www.ntodaynews.com
పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త.. వడ్డీ లేకుండా రూ.50 వేల రుణం
ఆంధ్రప్రదేశ్
పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త.. వడ్డీ లేకుండా రూ.50 వేల రుణం
అమరావతి: పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వడ్డీ లేకుండా ఒక్కో రైతుకు రూ.50 వేల వరకు రుణం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ రుణాన్ని రెండేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తొలి ఏడాదిలో సగం మొత్తం, రెండో ఏడాదిలో మిగిలిన మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 40 వేల మంది పొగాకు రైతులు లబ్ధి పొందనున్నారని ఆయన వెల్లడించారు. రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించి సాగు ఖర్చుల భారం తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొన్నారు.