www.ntodaynews.com
పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఖాజాను ఈగల్ టీమ్ చివరకు పట్టుకుంది. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నిందితుడు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. తనిఖీల్లో నిందితుడు ఉంటున్న గదిలోనే మాదకద్రవ్యాల నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, అతడిపై మరో కొత్త కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు ఒక హోటల్ యజమాని అని వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.