www.ntodaynews.com
పోలవరం గ్రామంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, యర్రా హేమంత్ కుమార్, యువ నాయకుడు చాగంటి రాధాబాబు, సీనియర్ నాయకులు చాగంటి బుచ్చిబాబు, మరిడి అప్పారావు, చెన్నయ్య, ఎస్సీ సెల్ నాయకుడు చాట్ల రామస్వామి, కోట రవి,తంబి, నల్లటి వెంకటేశు, తానంకి ప్రసాదు, తనగల హుజూరు, తేనేటి జయరాజు, మానికొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను కలిసి పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు.