BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దంపతులకు అవమానం – ఫిర్యాదు తీసుకోని వత్సవాయి ఎస్సైపై ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:55 AM
101 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి: ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యువ దంపతులకు ఎదురైన అనుభవం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటర్‌కాస్ట్ వివాహం చేసుకున్న ఈ జంటకు, ఫిర్యాదు స్వీకరించకుండా అవమానకరంగా ప్రవర్తించారని వత్సవాయి ఎస్సైపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బాధితుల కథనం ప్రకారం, అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పి రక్షణ కోరేందుకు వారు స్టేషన్‌కు వెళ్లగా, “మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురావాలి, లేకపోతే ఫిర్యాదు తీసుకోలేం” అంటూ ఎస్సై నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.

చట్టపరంగా మేజర్ వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో వివాహం చేసుకోవడం నేరం కాదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యతగా ఉండగా, ఫిర్యాదు స్వీకరించకుండా తిరస్కరించడం విమర్శలకు దారితీస్తోంది.

ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణభయంతో వచ్చిన వారినే తిరస్కరించడం, అవమానించడం పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత దంపతులకు తక్షణ రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.