BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

ప్రభుత్వ బడి బలోపేతానికి అన్నారం గ్రామం వినూత్న నిర్ణయం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Jun, 2026 - 05:34 PM
80 వీక్షణలు

ప్రైవేట్ పాఠశాలల్లో గ్రామ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వొద్దని వినతి

ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ప్రారంభం నేపథ్యంలో గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

డొంకేశ్వర్, జూన్ 19 (ఎన్‌టుడే న్యూస్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) మరియు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ నిర్ణయానికి అనుగుణంగా శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డొంకేశ్వర్‌లోని ఫ్రోబెల్ స్కూల్, ఎస్‌.ఎస్‌.వి. స్కూల్ యాజమాన్యాలను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని వారు స్కూల్ యాజమాన్యాలను కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అన్నారం గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.