BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ప్రభుత్వ బడి బలోపేతానికి అన్నారం గ్రామం వినూత్న నిర్ణయం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Jun, 2026 - 05:34 PM
184 వీక్షణలు

ప్రైవేట్ పాఠశాలల్లో గ్రామ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వొద్దని వినతి

ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ప్రారంభం నేపథ్యంలో గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

డొంకేశ్వర్, జూన్ 19 (ఎన్‌టుడే న్యూస్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) మరియు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ నిర్ణయానికి అనుగుణంగా శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డొంకేశ్వర్‌లోని ఫ్రోబెల్ స్కూల్, ఎస్‌.ఎస్‌.వి. స్కూల్ యాజమాన్యాలను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని వారు స్కూల్ యాజమాన్యాలను కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అన్నారం గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.