ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం
ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను అందించింది. మండల విద్యాశాఖాధికారి (MEO-1) మాసగిరి శ్రీనివాస్ (స్పెషల్ ఆఫీసర్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పోతనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గడిదేసి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు వడిత్యా రవీంద్రలతో కలిసి అంగన్వాడీ కేంద్రం నుంచి సుమారు 16 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 60కి చేరింది.
ఈ సందర్భంగా MEO-1 మాసగిరి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడీ టీచర్ను అభినందించారు.
గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు.