BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 10:11 PM
64 వీక్షణలు

ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్: ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్!

చిలకలూరిపేట రూర‌ల్‌:ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) హత్య కేసులో ఆయన భార్య నాగజ్యోతి (30)ని రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.

హత్యకు ప్లాన్ ఇలా

నాగజ్యోతికి పెళ్లికి ముందే బాపట్ల జిల్లాకు చెందిన ఉసరి వెంకట కోటయ్య (40)తో అక్రమ సంబంధం ఉంది. భర్తను వదిలించుకుంటే తామిద్దరం కలిసి ఉండవచ్చని, పైగా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని వీరు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా హరిప్రసాద్ పేరిట ఇన్సూరెన్స్ చేయించి, నాగజ్యోతిని నామినీగా పెట్టారు.

 యాక్సిడెంట్‌గా చిత్రీకరణ

ఈ ఏడాది ఏప్రిల్ 10న కోటయ్య తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి హరిప్రసాద్‌కు మద్యం తాగించాడు. అనంతరం యడవల్లి సమీపంలో ఇనుప రాడ్‌తో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శవాన్ని, స్కూటీని రోడ్డు పక్కన పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

 కేసు ఛేదించిన పోలీసులు

పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి దీనిని మర్డర్ కేసుగా నమోదు చేశారు. ఏప్రిల్ 12నే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, లోతుగా జరిపిన విచారణలో భార్య నాగజ్యోతి కుట్ర బయటపడింది. దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేసి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి క్లూస్ లేకపోయినా కేసును ఛేదించిన రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్.ఐ అనిల్ కుమార్‌లను పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు.