BREAKING
నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
www.ntodaynews.com

ప్రియుడితో కలిసి తాత హత్యకు మనవరాలి కుట్ర..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:40 PM
9 వీక్షణలు

ప్రియుడితో కలిసి తాత హత్యకు మనవరాలి కుట్ర.. వీడియో కాల్‌లో ప్రత్యక్షంగా వీక్షణ

కేరళలో సంచలనం సృష్టించిన దారుణ ఘటన.. ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరువనంతపురం/అలప్పుజ: కన్న కూతురిలా చూసుకోవాల్సిన మనవరాలే తాత హత్యకు కుట్ర పన్నిన ఘటన కేరళలో సంచలనం రేపింది. 13 ఏళ్ల బాలిక తన 17 ఏళ్ల ప్రియుడితో పాటు మరో ముగ్గురు మైనర్ల సహకారంతో 67 ఏళ్ల తాతను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య జరుగుతున్న సమయంలో బాలిక వీడియో కాల్‌లో ప్రత్యక్షంగా వీక్షించినట్లు దర్యాప్తులో తేలింది.

అలప్పుజలో జరిగిన ఈ ఘటనలో.. వృద్ధుడి భార్య చిన్న కుమార్తె ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు పథకం అమలు చేశారు. ఆగస్టు 15 రాత్రి బాలిక ప్రియుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఇంటికి చేరుకుని బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించారు.

వృద్ధుడి చేతులు, కాళ్లు కట్టి.. నోటిలో గుడ్డలు కుక్కి.. తలను గోడకు బలంగా కొట్టి.. అనంతరం ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణాన్ని బాలిక వీడియో కాల్ ద్వారా చూస్తూ సూచనలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 4.5 కాసుల బంగారాన్ని తీసుకుని నిందితులు పరారయ్యారు.

మరుసటి రోజు ఏమీ తెలియనట్లు నటించిన బాలిక.. సమీపంలోని దుకాణానికి వెళ్లి చిప్స్ కొనుగోలు చేసింది. తాత తలుపు తీయడం లేదని, బహుశా మద్యం తాగి నిద్రపోతున్నారని చెప్పింది. అంతేకాకుండా తాత మృతి చెందిన విషయం తెలిసినా పాఠశాలకు వెళ్లేందుకు యూనిఫాం ధరించి సిద్ధమైంది.

బంధువులు అనుమానంతో తలుపులు తెరిచి చూడగా వృద్ధుడు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత దొంగతనం కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో అసలు విషయం బయటపెట్టారు.

బాలికతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే కక్ష పెంచుకున్నట్లు బాలిక చెప్పినప్పటికీ.. డబ్బు కోసం కూడా ఈ కుట్ర జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు, బైక్ కొనుగోలు కోరికలు కూడా కారణాలుగా ఉండవచ్చని తెలిపారు.

మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. పెద్దల తరహాలో విచారణకు జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. విషాదకరంగా అదే సమయంలో వృద్ధుడి చిన్న కుమార్తె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్త మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి మార్చురీకి రావాల్సిన పరిస్థితి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.