ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక',
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', 'రెవెన్యూ క్లినిక్'
పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ పూర్తి వివరాలు, గత రసీదులతో వినతులు సమర్పించాలన్నారు. ఈ సేవలు మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంటాయని, ప్రజలు 1100 కాల్ సెంటర్ లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు, భూసంబంధిత సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తమ రికార్డులతో ఈ క్లినిక్కు హాజరై అర్జీలను స్వీకరిస్తారని, రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.