www.ntodaynews.com
ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్
జాతీయం
ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సంఖ్య 4,192కు చేరినట్లు అమికస్ క్యూరీ అన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు.
2025 నాటికి 1,243 కేసుల విచారణ పూర్తయినప్పటికీ, అదే ఏడాది కొత్తగా మరో 1,050 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రజాప్రతినిధులకు సంబంధించిన పెండింగ్ కేసుల సంఖ్య కొనసాగుతోందని తెలిపారు.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచకుండా ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన విచారణ ద్వారా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు.