BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:02 AM
52 వీక్షణలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

ముంబై, ఆగస్టు 5: బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో విలక్షణ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాట్) కారణంగా తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్‌లో లగాన్ చిత్రంతో గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం ఛత్రపతి చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్రతో విశేష ఆదరణ పొందారు. తన గంభీరమైన నటనతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

తెలుగులో ఆయన చివరిసారిగా గాయపడ్డ సింహం చిత్రంలో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

వ్యక్తిగత జీవితంలో తన ఏకైక కుమారుడిని హీరోగా చూడాలన్న కోరికతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.