ప్రతి నెల రెండవ బుధవారం మండల స్థాయి సమావేశాలు – టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు
ఏలూరు: పార్టీ అధిష్టానం ప్రతి నెల రెండవ బుధవారం ప్రతి మండలంలో మండల స్థాయి సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల సమావేశం 10-06-2026 మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడింది.
సభలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, పిఎసిఎస్ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సంబంధిత పార్టీ లీడర్లు, సీనియర్ నాయకులు తప్పనిసరిగా హాజరు కావలసినట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు, ఈ సమావేశాలను SIR (Special Intensive Revision) కార్యక్రమంతో అనుసంధానం చేసి ప్రణాళికను రూపొందించడం ముఖ్యమని పార్టీకి సూచించారు.