ప్రతి ఒక్కరి విజయాల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్
అమరావతి: భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో, విజయాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలనే కాకుండా మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పించడంలో గురువుల పాత్ర అత్యంత ముఖ్యమన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ విజ్ఞానవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.