www.ntodaynews.com
ప్రతి విద్యార్థి అభిప్రాయం మేరకే యూనిఫాం: సీఎం రేవంత్
తెలంగాణ
ప్రతి విద్యార్థి అభిప్రాయం మేరకే యూనిఫాం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఆగస్టు 15 నాటికి యూనిఫాంలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. యూనిఫాంల నాణ్యత, రూపకల్పనపై ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో యూనిఫాంల పంపిణీలో అవ్యవస్థలు జరిగాయని విమర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూన్ 2 నాటికే విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.