ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.71 వేల నగదు పురస్కారాలు
ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.71 వేల నగదు పురస్కారాలు
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది విద్యార్థులకు గురువారం దాతల సహకారంతో రూ.71 వేల నగదు పురస్కారాలు అందజేశారు.
దాతల్లో సివిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెరుకూరి వెంకటేశ్వరరావు రూ.50 వేల, యరమల ఆనందరెడ్డి రూ.6 వేల, వూట్ల సీతయ్య రూ.5 వేల, తోటమాల ఎఫ్రైమ్ రూ.5 వేల, సూరిశెట్టి బ్రదర్స్ రూ.5 వేల చొప్పున అందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మధిర మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సివి రావు, పంగా శేషగిరి, వార్డు కౌన్సిలర్లు పిల్లి సునీత, వేమిరెడ్డి లక్ష్మీ తులసి, శ్రీశైలం నర్సిరెడ్డి, పిల్లి మోజస్, రేగండ్ల సాంబశివరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.