BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

ప్రతిపక్షాలను చీలుస్తున్న బీజేపీ.. మూడింట రెండొంతుల మెజారిటీనే లక్ష్యమా?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
15 వీక్షణలు

న్యూఢిల్లీ, జులై 1 పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు సృష్టిస్తోందని సీపీఐ(ఎం) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు దెబ్బతింటున్నాయని ఆ పార్టీ విమర్శించింది. ఎన్నికల సంఘం కూడా అనేక అంశాల్లో రాజీ పడిందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.

‘ఆపరేషన్ లోటస్’తో ప్రాంతీయ పార్టీలే లక్ష్యం

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, అనంతరం శివసేన (యూబీటీ)లో చీలికలు తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీపై దృష్టి పెట్టిందని సీపీఐ(ఎం) పేర్కొంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణలకు అనుకూలమైన మెజారిటీ సాధించాలనే వ్యూహంతో ముందుకెళ్తోందని ఆరోపించింది.

పౌరసత్వంపై కొత్త వివాదం

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి గుర్తింపు పత్రం కాదంటూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై సీపీఐ(ఎం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలుకు అనుబంధంగా తీసుకొచ్చిన చర్యగా అభివర్ణించింది. బలహీన వర్గాలను ఓటు హక్కు నుంచి దూరం చేయడానికి ఉద్దేశపూర్వక వ్యూహం అమలవుతోందని ఆరోపించింది.

పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం

నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ మూల్యాంకన లోపాలు, సీయూఈటీ నిర్వహణలో గందరగోళం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనాలని సీపీఐ(ఎం) పేర్కొంది. గత 12 ఏండ్లలో 25కి పైగా కేంద్ర పరీక్షా పత్రాలు లీకయ్యాయని గుర్తుచేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

రామమందిరం విరాళాలపై దర్యాప్తు కోరిన సీపీఐ(ఎం)

అవినీతిని నిర్మూలిస్తామని చెప్పే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగ ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకరమని సీపీఐ(ఎం) పేర్కొంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్

అమెరికా-ఇరాన్ అవగాహనా ఒప్పందం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించడం లేదని సీపీఐ(ఎం) విమర్శించింది. రైతులకు యూరియా సహా ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరింది.

ఎన్నికల సంస్కరణలపై దేశవ్యాప్త ప్రచారం

వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కారణంగా కోట్లాది మంది ఓటర్లు తమ హక్కును కోల్పోయారని సీపీఐ(ఎం) ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ మొత్తం ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా సమగ్ర ప్రచారం చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సంస్కరణలు, ప్రజా సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.