BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

పర్వతాపురం ఎంపీయూపీ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ మీటింగ్–4.0

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 06:16 PM
33 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం

చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్–4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, నాగేశ్వరరావు, మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూబత్తుల చెన్నారావు, క్లస్టర్–1 ఇన్‌చార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, బీజేపీ నాయకుడు మేకపోతుల వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు మీనా కుమారి, జీవనజ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.