BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పర్వతాపురంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 01:32 PM
216 వీక్షణలు

పర్వతాపురంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం – ఎకో మిల్క్ అనలైజర్ ఆవిష్కరణ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో తిరువూరు క్లస్టర్ పరిధిలో నూతన పాల సేకరణ భవనం ఘనంగా ప్రారంభమైంది. అదే సందర్భంగా పాల నాణ్యతను మెరుగుపరచడం, ఖచ్చితమైన కొలతలను నిర్ధారించేందుకు పర్వతాపురం WMPAలో ఆధునిక ఎకో మిల్క్ అనలైజర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా పాలకవర్గ సభ్యులు బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్, సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్ మాట్లాడుతూ నాణ్యతలేని పాల వల్ల రైతులు, పాల సంఘాలు మరియు యూనియన్‌కు కలిగే నష్టాలను వివరించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎకో మిల్క్ అనలైజర్ ద్వారా పాల నాణ్యతను ఖచ్చితంగా పరీక్షించడం వల్ల రైతులకు సరైన ధర లభించడంతో పాటు పాల సంఘాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు.

అలాగే యూనియన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అధిక ధరలు, ధర వ్యత్యాసాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ పాలక సభ్యులు, గ్రామ సర్పంచ్ మిద్దె శివాజీ, పెద్దలు దేశిరెడ్డి రాఘవరెడ్డి, సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి. నారాయణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.