www.ntodaynews.com
పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవానికి రానున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట:మండల పరిధిలోని పసుమర్రు గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ పాఠశాలల ప్రహరీ గోడల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం (07.06.2026) ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ సకాలంలో తరలివచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.