www.ntodaynews.com
పశ్చిమ గోదావరి: ఆచంటలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న – చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్
/
పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నేడు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మరియు సంబంధిత అధికారులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.