ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది.
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య గారు ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయా అని ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ పరిశీలన సమయంలో డీన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య కే.శ్యామల గారు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ ఆచార్య విజయవర్ధిని గారు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సముచితంగా చేసి
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
డా.పి.ఎస్ గణేష మూర్తి,
ప్రజా సంబంధ అధికారి,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.