పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయొచ్చు అని అత్యవసర సమయంలో మీరు ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణం నిలుపుతుందని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు అలాగే రక్త నిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ జూన్ 15 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే మనం స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని రక్తదానం చేయాలని ఆయన తెలిపారు అలాగే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పూర్తి ఆరోగ్యంగా ఉంటారని ఇలాంటి అపోహలను నమ్మొద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.