పుంగనూరు లో కోట్ల రూపాయల విలువగల భూఆక్రమనను అరికట్టండి.. ప్రజాసంఘాలు, దళిత సంఘ నాయకులు..
పుంగనూరు మండలం గుడిసి బండ పంచాయతీ రాజులూరు వెళ్లు మార్గం లో రెండు ఎకరాల పై కొందరు భూ కబ్జా దారులకు ప్రభుత్వ డీకేటి భూమి పై కన్ను పడిందని దగ్గరలోని ఓ ప్రవేటు గ్రానెట్ వారు ఆక్రమించి మా స్థలం అని ఇక్కడి దళితులను రైతులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు వాపోయారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుంగనూరు లో ఎందరో నిరుపేదలు దళితులకు ఇల్లు కట్టుకోడానికి ఓ సెంటు భూమి కూడా లేకుండా కాళ్ళు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,అయితే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులు పట్టాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని,ఇప్పటి వరకు ఇదే భూమి ని పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని పలుమార్లు ఎమ్మార్వో కి వినతులు సమర్పించామని అయితే దీని పై అధికారులు స్పందించక పొగ బయటి వారు ఆక్రమిస్తున్న చూసి చూడనట్లు ఉన్నారని,ప్రభుత్వ అధికారులు ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని,పేదలకు,దళితుల కు ఇంటి స్థలాన్ని ఇప్పించాలని కోరారు.