పుంగనూరు లో పిల్లల బాడ్మింటన్ టోర్నమెంట్
పుంగనూరులో ఘనంగా LR బ్యాడ్మింటన్ అకాడమీ కిడ్స్ టోర్నమెంట్ – సీజన్-1
అన్నమయ్య జిల్లా పుంగనూరులో LR బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో కిడ్స్ టోర్నమెంట్ సీజన్-1 విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం. జగదీశ్ రాజు, కే. మంజునాథ్ రాజు, వెంకట్ రెడ్డి, రమేష్, అభిషేక్ కుమార్, సమీ ఉల్లా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జగదీశ్ రాజు మాట్లాడుతూ, నేటి క్రీడాకారులే రేపటి ఛాంపియన్లు అని పేర్కొన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విజేతలు
బిగినర్ కేటగిరీ
దేవనిషి – 1వ స్థానం
తనూజ – 2వ స్థానం
రాహిని – 3వ స్థానం
ఇంటర్మీడియట్ కేటగిరీ
శాన్విక – 1వ స్థానం
నెల్సన్ – 2వ స్థానం
లక్షిన్ (Lakshin) – 3వ స్థానం
అడ్వాన్స్ కేటగిరీ
మానస్వి (Manaswi) – 1వ స్థానం
ఆల్విన్ – 2వ స్థానం
అధ్విక్ (Adhvik) – 3వ స్థానం
ఈ సందర్భంగా LR బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధులు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను సిద్ధం చేసి పుంగనూరుకు మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.