BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోల నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 08:20 PM
52 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపుమేరకు వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వో అక్బర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెంకయ్యపాలెంకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పని భారం, అలాగే  పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వీఆర్వోలపై రోజురోజుకు పనిభారం పెరుగుతోందని దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్వోల సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు పని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని వీఆర్వో అక్బర్  డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మూడు రోజులపాటు నిరసనలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సుబ్రమణి, కేశవులు, రెడ్డమ్మ, రత్నప్ప, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.