BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

పుంగనూరులో దయనీయ స్థితి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 May, 2026 - 04:33 PM
85 వీక్షణలు

పుంగనూరులో దయనీయ స్థితి: మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ ధ్వజం

పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని భారత చైతన్య యువజన పార్టీ (BCY Party) పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ తీవ్రంగా విమర్శించారు.

చౌడేపల్లి మండలం, ఎగువ మల్లెవారిపల్లిలో క్రికెట్ ఆడుతూ 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ మాట్లాడుతూ..

వ్యవస్థల వైఫల్యం: "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోతే, ఆ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ గానీ, వాహన సౌకర్యం గానీ లేక స్నేహితులు బైక్‌పై తీసుకువెళ్లడం చూస్తుంటే మనం 2026లో ఉన్నామా? లేక 1970ల నాటి చీకటి రోజుల్లో ఉన్నామా? అనిపిస్తోంది." 

అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి సూటి ప్రశ్న: అభివృద్ధి అంటే కేవలం ప్రచారాలేనా? ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ప్రధాన డిమాండ్: పుంగనూరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యాయని విమర్శించారు.

ఈ ఘటనలో మరణించిన యువకుడి కుటుంబానికి బీసీవై పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరిబాబు యాదవ్ స్పష్టం చేశారు....