www.ntodaynews.com
పుంగనూరులో ఘనంగా బజాజ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభోత్సవం!
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరులో ఘనంగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నూతన శాఖ ప్రారంభోత్సవం!
NTODAY NEWS అన్నమయ్య జిల్లా
పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డులో (రాజు కాంప్లెక్స్) నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BAJAJ FINANCE LTD) బ్రాంచ్ మరియు గోల్డ్ లోన్ విభాగాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి. అయూబ్ ఖాన్ (చైర్మన్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్) రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పి. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ, పుంగనూరు పరిసర ప్రాంతాల ప్రజలకు, వ్యాపారులకు మరియు ఖాతాదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన ఆర్థిక సేవలు అందించడానికి ఈ నూతన శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తక్కువ డాక్యుమెంటేషన్తో, త్వరితగతిన గోల్డ్ లోన్ పొందే సదుపాయం స్థానికులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజు కాంప్లెక్స్ అధినేత రామకృష్ణం రాజు గారు,బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధులు మిస్టర్ గౌస్ బాషా (RSM), హరి ప్రసాద్ (ASM), ఎ. మునికృష్ణ (BM), సగిరాజు దిలీప్ రాజు (RM), సంస్థ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.