www.ntodaynews.com
పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి
అన్నమయ్య జిల్లా.పుంగనూరు
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కుమారుడు తల్లిపై దాడికి పాల్పడిన ఘటన పుంగనూరు పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లేట్ ఖాదర్బాషా భార్య రాహత్ జాన్ను ఆమె కుమారుడు ఆసిఫ్ మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని, మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని అన్నారు. దీంతో ఆవేశానికి గురైన ఆసిఫ్, చేతిలో ఉన్న కర్రతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు.