BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం

తెలంగాణ
21 Feb, 2026 - 10:55 AM
297 వీక్షణలు
పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం నిందితుడు అరెస్ట్ – మరిన్ని దొంగతనాలు ఒప్పుకున్న దొంగ NTODAY NEWS: రిపోర్టర్ శ్రీనివాస్, మంచిర్యాల మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ, పోచమ్మ చెరువు కట్టపై ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ తలుపులు పగులగొట్టి హుండీతో పాటు ఆభరణాలు, చీరలను అపహరించిన ఘటనలో నిందితుడు గుమ్మడి సారయ్యను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దుండగులు హుండీని పగులగొట్టి నగదు మరియు ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పెద్దమ్మతల్లి ఆలయ హుండీ నుండి సుమారు రూ.3,000 అపహరించినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఈ నెల 19న ఒక హనుమాన్ ఆలయంలో రూ.5,000 దొంగతనం చేసినట్లు, అలాగే గతంలో ఎంసీసీ పోస్టాఫీస్‌లో జరిగిన చోరీ ఘటనలో కూడా తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. గతంలోనూ ఈ ప్రాంతంలో చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో, రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. #Mancherial #TempleTheft #CrimeNews #TelanganaPolice Follow us on Website Facebook Instagram YouTube