www.ntodaynews.com
పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం
తెలంగాణ
పెద్దమ్మతల్లి ఆలయ చోరీ కేసు ఛేదనం
నిందితుడు అరెస్ట్ – మరిన్ని దొంగతనాలు ఒప్పుకున్న దొంగ
NTODAY NEWS: రిపోర్టర్ శ్రీనివాస్, మంచిర్యాల
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ, పోచమ్మ చెరువు కట్టపై ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ తలుపులు పగులగొట్టి హుండీతో పాటు ఆభరణాలు, చీరలను అపహరించిన ఘటనలో నిందితుడు గుమ్మడి సారయ్యను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దుండగులు హుండీని పగులగొట్టి నగదు మరియు ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పెద్దమ్మతల్లి ఆలయ హుండీ నుండి సుమారు రూ.3,000 అపహరించినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఈ నెల 19న ఒక హనుమాన్ ఆలయంలో రూ.5,000 దొంగతనం చేసినట్లు, అలాగే గతంలో ఎంసీసీ పోస్టాఫీస్లో జరిగిన చోరీ ఘటనలో కూడా తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
గతంలోనూ ఈ ప్రాంతంలో చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో, రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ను పెంచాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
#Mancherial #TempleTheft #CrimeNews #TelanganaPolice
Follow us on
Website
Facebook
Instagram
YouTube