www.ntodaynews.com
పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవం
తెలంగాణ
మీనాక్షి నగర్ ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవం
NTODAY NEWS: విజయవాడ
64వ డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్లో ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం పాస్టర్ ఎలీషా మరియు సంఘ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సంఘ సభ్యులకు రెండో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుచుకొని ప్రేమ, శాంతి, సేవాభావంతో జీవించాలని సూచించారు. నూతన సంవత్సరంలో సంఘ సభ్యులందరికీ ఆరోగ్యం, క్షేమాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వింజమూరి సతీష్ బాబు, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, 64వ డివిజన్ అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి షేక్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
#PentecostalChurch
#ChurchAnniversary
#MeenakshiNagar
#CommunityEvent
#FaithAndService
#PeaceAndLove
#CentralConstituency
#PublicRepresentative
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube