www.ntodaynews.com
అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం
తెలంగాణ
అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
కొండమడుగు గ్రామ ప్రజలు, విద్యార్దులకు, ఉపాధి కోసం వెళ్లేవారికి ఉదయం సమయంలో వస్తున్న బస్సు సమయానికి రాకపోవటం మరియు నూతన బస్సు సౌకర్యం కల్పించుటకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి విషయం తెలియజేయడంతో వారు చెంగిచెర్ల డిపో మేనేజర్ తో వారం రోజుల క్రితం మాట్లాడారు తక్షణమే మహదేవపూర్ నుండి ఉదయం 7:30 నీ లకు వస్తున్న బస్సును 8:00 గంలకు మార్చమని చెప్పడం జరిగింది. అలాగే నూతన బస్సు సౌకర్యాన్ని కొండమడుగు నుండి ఎయిమ్స్ ఆసుపత్రి మీదుగా వెళ్ళే విధంగా ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ తరుపున చెంగిచెర్ల డిపో మేనేజర్ తో మాట్లాడటం జరిగింది. సానుకూలంగా స్పందిస్తూ అసిస్టెంట్ మేనేజర్ కి తక్షణమే ఉదయం బస్సు సమయాన్ని మార్చాలని చెప్పడం జరిగింది. అలాగే తొందర్లోనే నూతన బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ డిపో మేనేజర్ కి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ తరుపున వినతిపత్రం అందజేయడం జరిగింది.
Follow us on
Website
Facebook
Instagram
YouTube