BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎంపీ పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 01:23 PM
164 వీక్షణలు

ఎంపీ పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు.. "పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?"

అమరావతి: నారా చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఫామ్‌హౌస్ వివాదంపై తీవ్రంగా స్పందించారు. యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని నమ్మి అవకాశమిస్తే… ఇలాంటి వ్యవహారాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

పార్టీ క్రమశిక్షణే ముఖ్యం

మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశంలో సీఎం ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

“పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా? గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై ఎలాంటి రాజీ పడలేదు. విలువలు, నియమాలు పాటించకుండా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు” అని చంద్రబాబు హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసలేం జరిగింది?

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు అనుమానంతో పలువురికి పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల ఫలితాలు:

మొత్తం 11 మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. వీరిలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు కూడా వెలుగులోకి రావడం రాజకీయంగా కలకలం రేపింది.

ఎంపీ వివరణ

ఈ ఘటనపై స్పందించిన పుట్టా మహేష్ యాదవ్… తాను డిన్నర్ పార్టీకి హాజరైన మాట నిజమేనని, కానీ ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

పార్టీలో చర్చాంశం

యువ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఈ వివాదం తెరపైకి రావడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద, ఈ ఘటన రాజకీయంగా మరింత మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.