BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 19 September 2025, 08:13 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు

తెలంగాణ
19 Sep, 2025 - 08:13 PM
359 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం అర్హత ఉన్న నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇవ్వాలని,ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయాలు తగవని,ఇప్పటికైనా ఇండ్లు కావలసిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున స్థానిక బొమ్మలరామారం మండలంలో సిపిఎం పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశం ముద్దం వసుంధర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్క గ్రామంలో నిజమైన లబ్ధిదారులను పదుల సంఖ్యలో తొలగిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో నిజమైన లబ్ధిదారులను మరో మారు గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కాంగ్రెస్ గ్రామ కమిటీలుగా మారాయని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చూడాలని గ్రామాల అభివృద్ధిల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తేనే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను సమీకరించి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఆందోళన చేపడుతామని శ్రీశైలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయి, పున్నమ్మ, వెంకటేష్, బ్రహ్మచారి, రవి, మధు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube