BREAKING
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు

తెలంగాణ
19 Sep, 2025 - 08:13 PM
240 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయాలు తగదు-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం అర్హత ఉన్న నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇవ్వాలని,ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయాలు తగవని,ఇప్పటికైనా ఇండ్లు కావలసిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున స్థానిక బొమ్మలరామారం మండలంలో సిపిఎం పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశం ముద్దం వసుంధర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్క గ్రామంలో నిజమైన లబ్ధిదారులను పదుల సంఖ్యలో తొలగిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో నిజమైన లబ్ధిదారులను మరో మారు గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కాంగ్రెస్ గ్రామ కమిటీలుగా మారాయని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చూడాలని గ్రామాల అభివృద్ధిల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తేనే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను సమీకరించి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఆందోళన చేపడుతామని శ్రీశైలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయి, పున్నమ్మ, వెంకటేష్, బ్రహ్మచారి, రవి, మధు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube