సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
NTODAY NEWS: చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్నికల సిబ్బందికి, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి, సుంకేనపల్లి గ్రామం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం 65వ జాతీయ రహదారిపై ఉన్న గుండ్రంపల్లి యూటర్న్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ను పరిశీలన చేసినారు. తరుచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల నివారణ కోసం గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ప్రమాద నివారణ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ ఎం రవి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube