BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 06:06 PM
36 వీక్షణలు

నూజివీడు పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మద్యం నిషేధ చట్టం–1995 (సవరణ చట్టం–2020) ప్రకారం రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మహిళల భద్రతకు భంగం కలగడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, కుటుంబాల్లో కలహాలు పెరగడం, యువత చెడు ప్రభావాలకు గురికావడం, పరిసరాల పరిశుభ్రత దెబ్బతినడం వంటి దుష్పరిణామాలను వివరించారు.

ప్రభుత్వం అనుమతించిన పర్మిట్ రూములు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం దుర్వినియోగం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన నష్టాలను గుర్తించి మద్యపాన నియంత్రణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నూజివీడు స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎ. మస్తానయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా సహకరించాలని అధికారులు కోరారు.