రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ, రానున్న కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ శంషాబాద్ 118, 119 డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు నొకమొల్ల శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, జి.వి.పి. సాగర్ (యువజన అధ్యక్షుడు), కొండ దీపక్, రచమల్ల కార్తీక్, రచమల్ల జయసింహ, బుచ్చిరెడ్డి, మాడపాటి పరమేశ్వరి, మంచర్ల శ్రీనివాస్, మంచర్ల మోహన్ రావు, గగన్ వినయ్, ఉషాకిరణ్, పి. నిఖిల్, దీపక్, స్వర్ణదీప్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల నిర్వహణపై నాయకులు పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.