జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు
శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
పుంగనూరు, చిత్తూరు జిల్లా: పుంగనూరు పట్టణంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించారు. కళాశాల ప్రాంగణానికి ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఆక్రమణలు, అతిక్రమణలు మరియు బయటి వ్యక్తుల జోక్యం పెరిగి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు.
1983లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఈ కళాశాలకు ఇప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగకపోవడం విచారకరమని తెలిపారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం కారణంగా రాత్రి సమయాల్లో కళాశాల ప్రాంగణం సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారుతూ, మద్యం సేవించే వారి సంచారం పెరిగి క్రమశిక్షణ లోపిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, పరికరాలు ఉన్నాయని, వాటిని రక్షించేందుకు కాంపౌండ్ వాల్ అత్యవసరమని తెలిపారు. గతంలో పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోయారు. ఇదే సమయంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తరగతి గదుల కొరత తీవ్రమవుతోందని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల స్థాపించబడిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు అదే ప్రాంగణంలో నాలుగు గదులు కేటాయించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని పుంగనూరు జనావాని కార్యక్రమంలో పుంగనూరు ఇంచార్జ్ సిరివేలు చిన్నా రాయల్ మరియు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, కి వినతి పత్రం అందజేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube