BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ

తెలంగాణ
23 Dec, 2025 - 12:49 AM
94 వీక్షణలు

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి పుంగనూరు, చిత్తూరు జిల్లా: పుంగనూరు పట్టణంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించారు. కళాశాల ప్రాంగణానికి ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఆక్రమణలు, అతిక్రమణలు మరియు బయటి వ్యక్తుల జోక్యం పెరిగి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు. 1983లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఈ కళాశాలకు ఇప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగకపోవడం విచారకరమని తెలిపారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం కారణంగా రాత్రి సమయాల్లో కళాశాల ప్రాంగణం సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారుతూ, మద్యం సేవించే వారి సంచారం పెరిగి క్రమశిక్షణ లోపిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, పరికరాలు ఉన్నాయని, వాటిని రక్షించేందుకు కాంపౌండ్ వాల్ అత్యవసరమని తెలిపారు. గతంలో పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోయారు. ఇదే సమయంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తరగతి గదుల కొరత తీవ్రమవుతోందని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల స్థాపించబడిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు అదే ప్రాంగణంలో నాలుగు గదులు కేటాయించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని పుంగనూరు జనావాని కార్యక్రమంలో పుంగనూరు ఇంచార్జ్ సిరివేలు చిన్నా రాయల్ మరియు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, కి వినతి పత్రం అందజేశారు. Follow us on Website Facebook Instagram YouTube