www.ntodaynews.com
బీసీల దీక్షకు మద్దతుగా నిరసన దీక్ష
తెలంగాణ
బీసీల దీక్షకు మద్దతుగా మంచిర్యాలలో నిరసన దీక్ష
NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్
గజెల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో గాంధీ పార్క్లో కార్యక్రమం
మంచిర్యాల, ఫిబ్రవరి 27: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ టీ. చిరంజీవులు నాయకత్వంలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ గాంధీ పార్క్లో జిల్లా బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య నిరసన దీక్ష చేపట్టారు.
ప్రధాన డిమాండ్లు
రూ. 50,000 కోట్లు: 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి భారీ నిధుల కేటాయింపు.
బీసీ సబ్ ప్లాన్ అమలు: కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
నిధుల విడుదల: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11,405 కోట్లను మార్చి 31లోపు విడుదల చేయాలి.
ఈ సందర్భంగా గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 61 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం లభించడం లేదని పేర్కొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని, హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
#Mancherial #BCWelfare #IndiraPark #Protest #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube