www.ntodaynews.com
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
తెలంగాణ
రాంనూర్లో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా రాంనూర్ గ్రామంలో శనివారం పారిశుద్ధ్య మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ అయిత తిరుపతి నేతృత్వంలో గ్రామంలోని వీధుల శుభ్రత, డ్రైనేజీ కాలువల పూడికతీత మరియు మొక్కల సంరక్షణ వంటి పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా అయిత తిరుపతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజా పాలన లక్ష్యానికి అనుగుణంగా ప్రతి వీధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్తులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలోని చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
#Ramnur #PrajaPalana #PragathiPranalika #VillageDevelopment #TelanganaNews #Jagtial #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube