www.ntodaynews.com
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
తెలంగాణ
ప్రజా సమస్యలను పరిష్కరించాలి--ర్యాకల శ్రీశైలం
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం
గత కొన్ని నెలలుగా బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ పాలకవర్గం లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోయి వాటిని పరిష్కారించే నాధుడే లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వంపై మండిపడ్డారు శుక్రవారం రోజున మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సర్పంచు పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు ఏ చిన్న సమస్య వచ్చిన గ్రామాల్లో ప్రజలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అయోమయం అవుతున్నారు అని అన్నారు ఇప్పటికైనా వెంటనే ఎన్నికలు నిర్వహించి గ్రామపంచాయతీలకు తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో పేరుకపోయినా మౌళిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి భూక్య రమేష్, రామావత్ నరేష్, నరేందర్,దేశెట్టి సత్యనారాయణ, గోపి, మోహన్, వినోద్, భాస్కర్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube