BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రాధా గాయత్రీ కేసులో సంచలన మలుపు.. భర్త శ్రీచరణ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
74 వీక్షణలు

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాధా గాయత్రీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రీ భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, పలు కోణాల్లో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

శ్రీచరణ్‌ను డెహ్రాడూన్‌లోని సంబంధిత పోలీసు అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నట్లు సమాచారం. ఈ విచారణలో కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం, శ్రీచరణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసులోని అన్ని కోణాలను పరిశీలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఈ అరెస్ట్‌తో రాధా గాయత్రీ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై డెహ్రాడూన్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.